యాప్నగరం

ఐదు గంటలు పాటు రేవంత్‌పై ప్రశ్నల వర్షం.. 23న మళ్లీ విచారణ

ఐదు గంటల పాటూ ఐటీ అధికారులు ప్రశ్నించారు. వారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను.. మళ్లీ 23న విచారణకు రమ్మన్నారు. కుట్రలో భాగంగానే ఐటీ దాడులు..

Samayam Telugu 3 Oct 2018, 6:45 pm
టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో ఐటీ అధికారుల విచారణ ముగిసింది. బుధవారం బషీర్‌బాగ్‌లోని ఆయకార్‌‌ భవన్‌‌లోని ఐటీ కార్యాలయంలో దాదాపు ఐదు గంటల పాటూ ప్రశ్నించారు. ఈ నెల 23న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విచారణ అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. కేసీఆర్, నరేంద్ర మోదీలు కలిసి ఐటీ, ఈడీలను ఉపయోగించుకొని దాడులు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టగలరు కాని.. వాటిని నిరూపించలేరన్నారు.
Samayam Telugu Revanth


తనకు ఎలాంటి అక్రమ కంపెనీలు లేవని.. ఐటీ దాడుల్ని రాజకీయ నేపథ్యంలో చేసిన వాటిగానే భావిస్తున్నానన్నారు రేవంత్. విచారణ సంస్థల్ని రాజకీయ కక్షలకు వేదికలుగా ఉపయోగించుకున్నట్లు స్పష్టం కనిపిస్తోందని.. తెలంగాణ ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సైన్యంపై తమపై దాడి చేస్తోందని.. ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు.

రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో 16 చోట్ల గత నెల 27, 28 తేదీల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రేవంత్ ఇంట్లో లాప్‌టాప్‌, హార్డ్ డిస్కులు, పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు.. అక్టోబరు 3న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి బుధవారం ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.