యాప్నగరం

ఓటుకు నోటు: సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహాకు నోటీసులు

ఓటుకు నోటు కేసులో ఏ1గా ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఉండగా, ఏ2గా సెబాస్టియన్‌ అన్న విషయం తెలిసిందే.

Samayam Telugu 28 Sep 2018, 2:13 pm
మూడేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ‘ఓటుకు నోటు కేసు’పై తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం మళ్లీ దృష్టిసారించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఓటుకు నోటు కేసు నిందితుల ఇళ్లు, ఆస్తులపై ఆదాయ పన్నుశాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు ముమ్మరం చేశాయి. ఆ కేసులో ఏ1 ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కాగా, ఏ2గా సెబాస్టియన్‌ ఉన్నారు.
Samayam Telugu Cash For Vote Case


ఓటుకు కోట్లు కేసు నిందితులు సెబాస్టియన్‌, ఉదయ్ సింహలకు ఐటీ యాక్ట్ ప్రకారం అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు శుక్రవారం సైతం కొనసాగుతున్నాయి. నిందితుడు సెబాస్టియన్‌ను వచ్చే నెల (అక్టోబర్‌ ) ఒకటో తేదీలోగా బషీర్‌బాగ్‌లోని ఆయకార్‌ భవన్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులలో సూచించారు. హాజరు కాని పక్షంలో సెక్షన్ 271ఏ ఆదాయపు పన్ను చట్టం కింద జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

కాగా, ఉదయ్‌ సింహా ఇంట్లో గురువారం ప్రారంభమైన ఐటీ, ఈడీ ఆకస్మిక తనిఖీలు శుక్రవారం కొనసాగుతున్నాయి. ఓటుకు కోట్లు కేసును తీవ్రంగా పరిగణిస్తున్న తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం.. ఉదయ్‌ సింహా ఆస్తులతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లు, కంపెనీలలో తనిఖీలు జరిగాయి. మూడేళ్ల కిందట తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు 50 లక్షల నగదు ఇస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ పట్టుబడ్డ విషయం తెలిసిందే.

అయితే ఆ 50 లక్షల నగదుతో పాటు స్టీఫెన్‌సన్‌కు తమ డీల్‌లో భాగంగా ఇవ్వనున్న డబ్బును ఎక్కడ నుంచి తీసుకొచ్చరన్న దానిపై అధికారులు ఉదయ్‌ సింహాను ప్రశ్నించినట్లు సమాచారం. ఆదాయ వివరాలను వెల్లడించకపోవడం, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న కారణంగా ఉదయ్ సింహాకు సెక్షన్‌ 131 ఆదాయపన్ను చట్టం-1961 ప్రకారం నోటీసులిచ్చారు. అక్టోబర్‌ 1న విచారణకు సిద్దంగా ఉండాలని ఆ నోటీసులో పేర్నొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.