ఇరవై ఏళ్ల కిందట సైకిళ్లకు పంక్చర్లు వేసుకునే చిన్న దుకాణం ప్రారంభించి రోజువారీ రూ.50 సంపాదించే అతడు ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టాడు. తిరుపతికి చెందిన కందిశెట్టి రమేశ్ అందరికీ పల్లెవీధి రమేశ్గా సుపరిచితుడైన వడ్డీ వ్యాపారి. పంక్చర్లు వేసే దుకాణంతో ప్రారంభమై, ప్రస్తుతం వడ్డీ వ్యాపారంతో కోట్లు సంపాదించాడు. ఈయన దగ్గర రుణం తీసుకున్నవారిలో రోజువారీ కూలీ దగ్గర నుంచి అధికారులు, వైద్యులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. రోజువారి వడ్డీలకు అప్పులిచ్చి ఫైనాన్స్ వ్యాపారంలో పుంజుకుని చివరకు ఆదాయపుపన్ను శాఖ అధికారులకు చిక్కాడు. రమేశ్ వడ్డీ వ్యాపారం గురించి ఐటీ అధికారులకు సమాచారం అందడంతో ల్లో వరుసగా రెండురోజుల పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. మంగళ, బుధవారాలు జరిపిన దాడుల్లో లభించిన ఆస్తుల చిట్టాను చూసి ఆదాయపుపన్ను శాఖ అధికారులే విస్తుపోయారు. బుధవారం వరకు లెక్కించిన ఆస్తుల మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు.
ఇంకా పన్ను మినహాయింపు ఆస్తులను, ఇతరత్రా వాటి విలువను కూడా లెక్కించే పనిలో ఉన్నారు. నడిపేది పంక్చర్లు దుకాణమే అయినా ఆయన ఆదాయ మార్గాల్లో ప్రధానంగా వడ్డీ వ్యాపారమేనని తేలింది. మంగళవారం ప్రారంభమైన ఐటీ దాడులు గురువారం సైతం కొనసాగుతున్నాయి. హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఆదాయపు పన్నుశాఖ ఆపరేషన్ విభాగం అడిషినల్ జాయింట్ డైరెక్టర్ మోహన్కుమార్ నేతృత్వంలో 25 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి దాడులను నిర్వహించారు.
రమేశ్ నివాసాలపై దాడులు చేసిన ఐటీ అధికారులు.. అక్కడ లభ్యమైన ఆస్తుల చిట్టా చూసి అవాక్కయ్యారు. రుణాలు పొందిన పత్రాలు, తనఖా పత్రాలు, ప్రామిసరీ నోట్లు వందలాదిగా ఇంట్లో బయటపడ్డాయి. వీటితోపాటు పెద్ద మొత్తంలో బంగారం, నగదు, స్థిరాస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ప్రధాన కూడలిలోని అయిదు అంతస్తుల భవనం, కోర్టు సముదాయాల పక్కనే నాలుగు అంతస్తుల బిల్డిండ్, దాని పక్కనే నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం రమేష్దేనని గుర్తించారు.
తక్కువ కాలంలోనే ఎదిగిన రమేశ్కు రాజకీయ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అవసరానికి తగ్గట్టుగా వడ్డీని పెంచి ముక్కుపిండీ డబ్బు వసూలు చేసేవాడు. అవసరాలన్ని బట్టి రూ.10 లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి లక్షలకు లక్షలు అప్పులు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అనుకున్న సమయానికి రుణం చెల్లించకపోతే అప్పుతీసుకునే వాళ్లపై భౌతికదాడులకు పాల్పడటమే కాదు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు అండ పుష్కలంగా ఉండటంతో ఇతగాడి బాధలు భరించలేక చాలా మంది తిరుపతి వదిలిపెట్టి వెళ్లిపోయారు.
ఇంకా పన్ను మినహాయింపు ఆస్తులను, ఇతరత్రా వాటి విలువను కూడా లెక్కించే పనిలో ఉన్నారు. నడిపేది పంక్చర్లు దుకాణమే అయినా ఆయన ఆదాయ మార్గాల్లో ప్రధానంగా వడ్డీ వ్యాపారమేనని తేలింది. మంగళవారం ప్రారంభమైన ఐటీ దాడులు గురువారం సైతం కొనసాగుతున్నాయి. హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఆదాయపు పన్నుశాఖ ఆపరేషన్ విభాగం అడిషినల్ జాయింట్ డైరెక్టర్ మోహన్కుమార్ నేతృత్వంలో 25 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి దాడులను నిర్వహించారు.
రమేశ్ నివాసాలపై దాడులు చేసిన ఐటీ అధికారులు.. అక్కడ లభ్యమైన ఆస్తుల చిట్టా చూసి అవాక్కయ్యారు. రుణాలు పొందిన పత్రాలు, తనఖా పత్రాలు, ప్రామిసరీ నోట్లు వందలాదిగా ఇంట్లో బయటపడ్డాయి. వీటితోపాటు పెద్ద మొత్తంలో బంగారం, నగదు, స్థిరాస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ప్రధాన కూడలిలోని అయిదు అంతస్తుల భవనం, కోర్టు సముదాయాల పక్కనే నాలుగు అంతస్తుల బిల్డిండ్, దాని పక్కనే నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం రమేష్దేనని గుర్తించారు.
తక్కువ కాలంలోనే ఎదిగిన రమేశ్కు రాజకీయ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అవసరానికి తగ్గట్టుగా వడ్డీని పెంచి ముక్కుపిండీ డబ్బు వసూలు చేసేవాడు. అవసరాలన్ని బట్టి రూ.10 లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి లక్షలకు లక్షలు అప్పులు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అనుకున్న సమయానికి రుణం చెల్లించకపోతే అప్పుతీసుకునే వాళ్లపై భౌతికదాడులకు పాల్పడటమే కాదు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు అండ పుష్కలంగా ఉండటంతో ఇతగాడి బాధలు భరించలేక చాలా మంది తిరుపతి వదిలిపెట్టి వెళ్లిపోయారు.