యాప్నగరం

ఫెర్టిలిటీ ఆస్పత్రిపై ఐటీ దాడులు

ఆదాయపన్ను కట్టకుండా ఎగవేతలు వేస్తున్న ఓ ఆసుపత్రిపై ఆదాయపన్ను శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు.

TNN 10 Jan 2017, 7:09 pm
ఆదాయపన్ను కట్టకుండా ఎగవేతలు వేస్తున్న ఓ ఆసుపత్రిపై ఆదాయపన్ను శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. డాక్టర్ పద్మజకు చెందిన ఫెర్టిలిటీ సెంటర్లు హైదరాబాద్ లోని హబ్సిగూడలో, భువనగిరిలో ఉన్నాయి. ఈ రెండు సెంటర్లపై మంగళవారం ఐటీ అధికారులు దాడి చేశారు. గత రెండేళ్లుగా ఆదాయపన్ను కట్టకపోవడంతో ఆ ఆసుపత్రికి, యాజమాన్యానికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు భారీగా ఆస్తులు గుర్తించారు. చట్ట విరుద్ధంగా నిర్వహించిన సరోగసీ పద్ధతిలో చేసిన కాన్పుల రికార్డులను కూడా గుర్తించి సీజ్ చేసినట్టు సమాచారం. ఆసుపత్రి యాజమాన్యానికి చెందిన అక్రమాస్తులను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.