యాప్నగరం

ఆతిథ్యానికి ఫిదా.. కేసీఆర్‌కు ఇవాంకా లేఖ

హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన తెలంగాణ ప్రజలపై ప్రశంసలు గుప్పిస్తూ ఇవాంకా ట్రంప్ లేఖ రాశారు.

TNN 19 Dec 2017, 12:51 pm
నవంబర్ చివరి వారంలో జరిగిన గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌ కోసం హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ట్రంప్ భారత ఆతిథ్యానికి ఫిదా అయిపోయారు. భాగ్యనగరంలో పర్యటించిన ఆమెపై ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసలు గుప్పించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం కేసీఆర్ ఆమెకు బహుమతిని అందజేశారు. తెలంగాణలో తనకు లభించిన ఆతిథ్యం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఇవాంకా.. సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన లేఖ రూపంలో సందేశం పంపారు.
Samayam Telugu ivanka trump pens heartwarming letter to telangana cm k chandrashekhar rao
ఆతిథ్యానికి ఫిదా.. కేసీఆర్‌కు ఇవాంకా లేఖ


డియర్ చీఫ్ మినిస్టర్ రావ్, జీఈఎస్ సదస్సు సందర్భంగా హైదరాబాద్ వచ్చిన నాకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. ఇది నాకెంతో స్ఫూర్తివంతమైన అనుభవం. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అద్భుతమైన బహుమతిని అందజేసినందుకు ధన్యవాదాలు. తెలంగాణ ఆతిథ్యం నన్ను కట్టిపడేసింది. భవిష్యత్తులో మరోసారి భారత్‌ను సందర్శించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అంటూ ఆమె కేసీఆర్‌కు లేఖ రాశారు.

#IvankaTrump pens down letter to Telangana Chief Minister K Chandrashekhar Rao, thanks him for his warm hospitality during her Hyderabad visit last month pic.twitter.com/ff87bJKXmL — ANI (@ANI) December 18, 2017
ఇవాంకా పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతోపాటు నగరాన్ని అందంగా ముస్తాబు చేసింది. ముఖ్యమైన సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.