యాప్నగరం

​ఐవైఆర్ కు గవర్నర్ నరసింహన్ హితబోధ!

బ్రహ్మణ కార్పొరేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగింపుకు గురైన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

TNN 22 Jun 2017, 9:08 am
బ్రహ్మణ కార్పొరేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగింపుకు గురైన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. తనను బ్రహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించిన తర్వాత కొంతమంది తనపై సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులను పెట్టిన వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తనను అవమానిస్తూ, అవహేళన చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఐవైఆర్ కోరారు. అయితే ఈ ఫిర్యాదు పట్ల గవర్నర్ ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. వాటిని అస్సలు పట్టించుకోవద్దు అంటూ ఐవైఆర్ కు సూచించారు నరసింహన్.
Samayam Telugu iyr complaints against social media
​ఐవైఆర్ కు గవర్నర్ నరసింహన్ హితబోధ!


‘మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన వ్యక్తి. సంఘంలో గౌరవమర్యాదలు కలిగిన వ్యక్తి. నీఛమైన పోస్టులు పెట్టే వాళ్లు డ్రైనేజ్ స్థాయి మనుషులు.. మీరు వారి గురించి పట్టించుకోవడం అంటే వారి స్థాయిని పెంచినట్టే. ఆ పని చేయవద్దు.. అలాంటి డ్రైనేజ్ స్థాయి మనుషుల తీరుకు ప్రాధాన్యతను ఇవ్వవద్దు..’ అని నరసింహన్ ఐవైఆర్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ హితబోధతో ఐవైఆర్ సమాధానపడ్డట్టుగా సమాచారం.

ఏపీ ప్రభుత్వం ఐవైఆర్ ను పదవి నుంచి తొలగించిన కొన్ని నిమిషాల్లోనే కొంతమంది నెటిజన్లు ఐవైఆర్ పై తీవ్రమైన అనుచిత పోస్టులను పెట్టారు. ఇక ఐవైఆర్ ప్రెస్ మీట్ తర్వాత మరింతగా రెచ్చిపోయారు. ఆయనను తీవ్రంగా దూషిస్తూ, అభ్యంతకరమైన చిత్రాలను పోస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.