యాప్నగరం

రైతులకు జగన్ మరో హామీ

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రైతాంగానికి మరో హామీని ఇచ్చారు.

TNN 21 Feb 2018, 4:13 pm
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రైతాంగానికి మరో హామీని ఇచ్చారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్రను సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి... రైతులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి వచ్చిన పలు డిమాండ్ల పట్ల జగన్ స్పందించారు. రైతుల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇది వరకూ ఇచ్చిన హామీలకు తోడూ.. జగన్ ఇప్పుడు మరో హామీనిచ్చారు.
Samayam Telugu jagan another promise for farmers
రైతులకు జగన్ మరో హామీ


అర్ధరాత్రి, అపరాత్రుల వేళ పొలం దగ్గరకు వెళ్లే రైతులు ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొంటే.. వారికి బీమాను కల్పించే హామీని ఇచ్చారు జగన్. తమ ప్రభుత్వం వస్తే రైతుల కోసం ఇలాంటి ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. రాత్రుల వేళ బావుల దగ్గరకు వెళ్లే రైతులకు అనేక రకాల ఇబ్బందులు ఉంటారు. ఇలా అనేక మంది రైతులు ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారికి జరగరానిది జరిగితే ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇస్తామని జగన్ ప్రకటించారు. ‘వైఎస్సార్ బీమా’ పేరుతో ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తామని జగన్ ప్రకటించారు.

నేటితో జగన్ పాదయాత్ర 94వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర ముగిసి.. కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకూ జగన్ సుమారు 1,270 కిలోమీటర్ల దూరాన్ని నడించారు.S

See Pics: ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర ఫొటోలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.