యాప్నగరం

జగన్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సరస్వతి పవర్‌కి చెందిన 903 ఎకరాల భూములను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది.

TNN 8 Feb 2017, 10:21 am
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సరస్వతి పవర్‌కి చెందిన 903 ఎకరాల భూములను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని.. తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో భూములను అడ్జుడికేటింగ్‌ అథారిటీ ఆమోదంతో స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్‌ చట్టం కింద రూ.318 కోట్ల విలువైన ఈ భూమిని ఈడీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ భూములపై క్రయ విక్రయాలు, బహుమతులు, తనఖాలు చెల్లవని ఈడీ స్పష్టం చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ఈ భూములను స్వాధీన చేసుకున్నట్లు ఈడీ పత్రికల్లో ప్రకటన ఇచ్చింది.
Samayam Telugu jagan assets seized by enforcement directorate
జగన్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ


గతంలోనూ ఈడీ జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్లో రూ.177కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అంతకు ముందు జూన్‌లో భారతి సిమెంట్‌కు చెందిన రూ.749.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ప్రాథమికంగా అటాచ్ చేయగా.. ఆ ఆస్తుల్లో భారతీ సిమెంట్‌కు చెందిన రూ. 177 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.