యాప్నగరం

జగన్ పాదయాత్ర @700 కిలోమీటర్లు

పాదయాత్రలో 50 రోజులను పూర్తి చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

TNN 3 Jan 2018, 11:40 am
పాదయాత్రలో 50 రోజులను పూర్తి చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 700 కిలోమీటర్ల మైలు రాయిని కూడా దాటేశారు. మంగళవారంతో జగన్ ఏడువందల కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని చింతపర్తి వద్ద జగన్ ఈ మైలురాయిని దాటారు.
Samayam Telugu jagan crosses 700km milestone on padayatra
జగన్ పాదయాత్ర @700 కిలోమీటర్లు


నేడు పాదయాత్రకు 51వ రోజు. పీలేరు నియోజకవర్గంలోనే జగన్ పాదయాత్ర సాగుతోంది. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం గమనార్హం.

పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం జగన్ ను కలుస్తున్నారు. తమ తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. ప్రధానంగా పెన్షన్ రావడం లేదని, రుణమాఫీ జరగలేదనే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. సీపీఎస్ విధానం విషయంలో కూడా ఫిర్యాదులు అందుతున్నాయి.

జగన్ పాదయాత్ర ఏడు వందల కిలోమీటర్ల మార్కును చేసిన చోట.. ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేశారు. పాదయాత్రకు అది 50వ రోజు కూడా కావడంతో వైసీపీ అభిమానులు మరింత ఉత్సాహవంతంగా ఏర్పాట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.