హైదరాబాద్: సీబీఐ ఎంక్వైరీ చేపడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని వ్రతిపక్ష నేత జగన్ అన్నారు. రాజధాని భూముల వ్యవహారంపై సభలో చంద్రబాబు వివరణ అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. నిజాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎంక్వైరీకి అంగీకరించడలేదని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు దోచుకున్నారని .. సీబీఐ విచారణ చేపడితే ఎన్ని ఎకరాలు ..ఎవరు దోచుకున్నారనే విషయం వెలుగులోకి వస్తుందని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు.
సీబీఐ ఎంక్వైరీతోనే న్యాయం జరుగుతుంది- జగన్
హైదరాబాద్: రాజధాని భూమల వ్యవహారం సీఎం వివరణ అనంతరం సభలో జగన్ మాట్లాడారు.
TNN 9 Mar 2016, 4:17 pm