యాప్నగరం

ఒకే విమానంలో జగన్, కేసీఆర్, గవర్నర్!

ఒకే విమానంలో ప్రయాణించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్, గవర్నర్‌లు. విజయవాడలో ప్రత్యేక విమానం.

Samayam Telugu 28 May 2019, 7:34 am
త్వరలో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఒకే విమానంలో ప్రయాణం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ, రాత్రి ఏడు గంటలకు ఢిల్లీలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని వీరికి ఆహ్వానం అందింది.
Samayam Telugu Jagan_KCR_Facebook_Telangana CMO_File


ఇదే రోజున అమరావతిలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌తోపాటు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్, గవర్నర్‌లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కూడా వెళ్లేందుకు సిద్ధమైతే ముగ్గురు ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.