యాప్నగరం

జగన్‌ను శశికళ, గాలి అనుసరిస్తారేమో?

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూడబెట్టిన అక్రమాస్తులన్నింటినీ ప్రజలకు అప్పగించిన తర్వాతే వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను చేపట్టాలని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ డిమాండ్ చేశారు.

TNN 11 Oct 2017, 6:23 pm
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూడబెట్టిన అక్రమాస్తులన్నింటినీ ప్రజలకు అప్పగించిన తర్వాతే వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను చేపట్టాలని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ డిమాండ్ చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ స్ఫూర్తితో తమిళనాడులో శశికళ, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డిలు కూడా పాదయాత్రలు చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారంటూ గతంలో జగన్ ప్రకటించారని... వైసీపీ ఎంపీలు ఇంకెప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని యువత ముఖ్యమంత్రి చంద్రబాబులాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి యువతకు ఎలాంటి సందేశం ఇవ్వగలడని అన్నారు.
Samayam Telugu jagan paadayatra tdp senior leader kambampati rammohan fires on jagan
జగన్‌ను శశికళ, గాలి అనుసరిస్తారేమో?


ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... ఈ నేపథ్యంలో ఎక్కువ నిధులను రాబట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ​ సమైక్యవాదనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి కేంద్రమే 100 శాతం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని కంభపాటి అన్నారు. వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత లేదని మంత్రి సోమిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా పేరుతో విద్యార్థులను జగన్ మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వర్షాలు బాగా పడి శ్రీశైలం ప్రాజెక్టు నిండితే వైసీపీ మండిపోతోందని ధ్వజమెత్తారు. పంటకుంటలు నిండటంతో జగన్, రోజా జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.