యాప్నగరం

జగన్ పాదయాత్ర @50 డేస్

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 50వ రోజుకు చేరుకుంది.

TNN 2 Jan 2018, 3:39 pm
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 50వ రోజుకు చేరుకుంది. మంగళవారంతో జగన్ పాదయాత్ర హాఫ్ సెంచరీ డేస్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గం ద్వారా జగన్ చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యారు.
Samayam Telugu jagan padayatra 50 days
జగన్ పాదయాత్ర @50 డేస్


ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జగన్ పాదయాత్ర పూర్తి అయిన సంగతి తెలిసిందే. సొంత జిల్లాలో ఇడుపులపాయలోని తండ్రి సమాధివద్ద నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. కడప జిల్లాలోని వివిధ నియోజకవర్గాల వారీగా సాగి.. కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఆపై అనంతపురం జిల్లా మీదుగా చిత్తూరుకు చేరింది.

ఈ పాదయాత్రతో మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని నడవడానికి సంకల్పించారు జగన్. ఇప్పటివరకూ ఆయన 687 కిలోమీటర్ల దూరం నడిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.