యాప్నగరం

సీమలో మరో జిల్లాలోకి ఎంటరైన జగన్

‘ప్రజాసంకల్పం’ పాదయాత్రను చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,

TNN 4 Dec 2017, 11:33 am
‘ప్రజాసంకల్పం’ పాదయాత్రను చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించారు. కడప జిల్లా పులివెందుల్లో మొదలైన జగన్ యాత్ర కర్నూలు జిల్లా మీదుగా సాగి ఇప్పుడు రాయలసీమలోనే అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. అనంత జిల్లాలోని గుంతకల్ నియోజకవర్గం పరిధిలోని గుత్తి మండలం బసినేపల్లి వద్ద జగన్ పాదయాత్ర అనంతలోకి ప్రవేశించింది. తమ జిల్లాలోకి ఎంటరైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైకాపా నేతలు, కార్యక్తలు ఘనస్వాగతం పలికారు.
Samayam Telugu jagan padayatra enters anantapur dist
సీమలో మరో జిల్లాలోకి ఎంటరైన జగన్


జగన్ పాదయాత్ర నేటితో 26వ రోజుకు చేరుకుంది. 25వ రోజుకు జగన్ పాదయాత్ర 356 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. నిన్న జగన్ 10.6 కిలోమీటర్ల దూరం నడిచారు.

అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర ఎనిమిది నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈ జిల్లాలో రెండు వందల కిలోమీటర్ల పై దూరాన్నే నడవనున్నారు జగన్ మోహన్ రెడ్డి. గుంతకల్, తాడిపత్రి, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి తదితర నియోజకవర్గాల మీదుగా జగన్ పాదయాత్ర సాగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.