యాప్నగరం

ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన జగన్

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించారు.

TNN 16 Feb 2018, 12:41 pm
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకుని ప్రకాశం జిల్లాలోకి ఎంటరయ్యారు జగన్. ఈ సందర్భంగా జగన్ కు ప్రకాశం జిల్లా వైకాపా నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం ఘనంగా స్వాగతం పలికారు. జగన్ కు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు ప్రకాశం జిల్లా వైకాపా నేతలు. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద శుక్రవారం ఉదయం జగన్ ప్రకాశంలోకి ఎంటరయ్యారు.
Samayam Telugu jagan padayatra enters into prakasham dist
ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన జగన్


ప్రకాశం జిల్లాలో జగన్ మొత్తం 9 నియోజకవర్గాల మీదుగా పాదయాత్రను కొనసాగిస్తారని వైకాపా ప్రకటించింది. కందుకూరుతో మొదలుకుని ఆ తర్వాత కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల మీదుగా ప్రజాసంకల్ప పాదయాత్ర సాగుతుంది. ప్రకాశం జిల్లాలో జగన్ దాదాపు 255 కిలోమీటర్ల దూరాన్ని నడుస్తారని తెలుస్తోంది.

ఇప్పటి వరకూ జగన్ కడప జిల్లాతో మొదలుపెట్టి.. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం మూడు వేల కిలోమీటర్ల సుదూర పాదయాత్రను చేస్తున్నారు జగన్. నేటితో ఈ యాత్ర 89వ రోజుకు చేరుకుంది. దాదాపు 1,200 కిలోమీటర్ల దూరాన్ని నడించారు జగన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.