‘ప్రజాసంకల్పం’ పాదయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జేసీ సోదరుల ఇలాకాలో తన యాత్ర సాగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గంతో మొదలైన జగన్ పాదయాత్ర.. తాడిపత్రి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి ప్రవేశించింది. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పెద్దవడుగూరులో నిన్న జగన్ సభ కూడా నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున జనసందోహం హాజరుకావడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దశాబ్దాలుగా జేసీ సోదరుల కంచుకోటగా ఉన్న తాడిపత్రి సెగ్మెంట్లో సభ విజయవంతం కావడం పట్ల వైసీని స్థానిక నాయకత్వం ఆనందం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ పార్టీని వీడిన అనంతరం జేసీ సోదరులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ఉండగా, తాడిపత్రి ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు వైసీపీ అధినేతపై తరచూ మాటల దాడిని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాడిపత్రికి ఇన్ చార్జిగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమించారు వైకాపా అధినేత.
గతంలో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తాడిపత్రిలో జేసీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. ఈ క్రమంలో సూర్యప్రతాపరెడ్డి తమ్ముడినే తాడిపత్రి ఇన్ చార్జిగా ప్రకటించారు జగన్. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. కొన్నాళ్లుగా తాడిపత్రిలోనే మకాం పెట్టి పెద్దారెడ్డి రాజకీయ కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉన్నారు.
నేటితో జగన్ పాదయాత్ర 28వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లాలో నాలుగో రోజు జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన అనంతరం జేసీ సోదరులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ఉండగా, తాడిపత్రి ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు వైసీపీ అధినేతపై తరచూ మాటల దాడిని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాడిపత్రికి ఇన్ చార్జిగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమించారు వైకాపా అధినేత.
గతంలో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తాడిపత్రిలో జేసీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. ఈ క్రమంలో సూర్యప్రతాపరెడ్డి తమ్ముడినే తాడిపత్రి ఇన్ చార్జిగా ప్రకటించారు జగన్. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. కొన్నాళ్లుగా తాడిపత్రిలోనే మకాం పెట్టి పెద్దారెడ్డి రాజకీయ కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉన్నారు.
నేటితో జగన్ పాదయాత్ర 28వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లాలో నాలుగో రోజు జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు.