యాప్నగరం

మరో జిల్లాను దాటేస్తున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాను దాదాపుగా దాటేస్తోంది.

TNN 12 Feb 2018, 3:54 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాను దాదాపుగా దాటేస్తోంది. మరో నాలుగు రోజుల్లో జగన్ నెల్లూరు జిల్లాను దాటి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారని వైకాపా ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతుందని వైకాపా నేత బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో పూర్తి అయ్యి, ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ కాబోతోంది జగన్ పాదయాత్ర.
Samayam Telugu jagan padayatra to enter into prakasham dist
మరో జిల్లాను దాటేస్తున్న జగన్


ఇప్పటి వరకూ జగన్ పాదయాత్ర 84 రోజులను పూర్తి చేసుకుంది. సుమారు 1,140 కిలోమీటర్ల దూరాన్ని నడిచారు జగన్. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్ర సాగుతోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాలోకి చేరారు జగన్. మొత్తం మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలనే సంకల్పంతో జగన్ ఈ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రకాశం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ప్రజా సంకల్పయాత్ర సాగుతుందని వైకాపా ప్రకటించింది. ఈ జిల్లాలో కందుకూరు నియోజకవర్గం నుంచి జగన్ పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. ప్రకాశం జిల్లాలో జగన్ దాదాపు 255 కిలోమీటర్ల దూరాన్ని నడుస్తారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.