యాప్నగరం

బాబూ.. బావిలో దూకు శని వదులుతుంది: జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 6 Apr 2018, 10:10 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోసపూరిత విధానం దేశం మొత్తానికి తెలుసని, ఢిల్లీలో ఆయనను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. తన అవినీతిపై కేంద్రం విచారణ చేయిస్తుందనే భయంతోనే ఆయన ఎంపీలతో ఆందోళన చేయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, హిట్లర్ మనస్తత్వాలు ఒకటేనన్నారు.
Samayam Telugu ja


గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో జగన్‌ శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. ఎంపీ హేమామాలినీని కలవడానికే సీఎం ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ప్రజలను నాలుగేళ్లుగా మోసం, అన్యాయం చేస్తూ.. ఇప్పుడు సైకిల్‌ ర్యాలీ, అఖిల పక్షం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని జగన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రజల దృష్టిలో ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతారన్నారు.

ఇంత అన్యాయం చేస్తున్న చంద్రబాబు ఏదైనా బావి చూసుకుని దూకితే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు పట్టుకుని శని వదులుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బాబుకు ఏడు ప్రశ్నలు సంధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.