యాప్నగరం

నీటి సంరక్షణ కోసం ‘జలం - జీవం’: కేటీఆర్

హైదరాబాద్ మహా నగరంలో నీటి సంరక్షణ కోసం ‘జలం - జీవం’ కార్యక్రమాన్ని చేపడతామని కేటీఆర్ ప్రకటించారు. మియాపూర్‌లోని విశ్వనాథ గార్డెన్స్‌లో శనివారం ఆయన ‘మన నగరం’ కార్యక్రమంలో పాల్గొ్న్నారు.

TNN 6 Jan 2018, 11:51 pm
భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మహా నగరంలో నీటి సంరక్షణ కోసం ‘జలం - జీవం’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. మియాపూర్‌లోని విశ్వనాథ గార్డెన్స్‌లో శనివారం (జనవరి 6) ఆయన ‘మన నగరం’ కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వేదిక ద్వారా పలు సమస్యలకు పరిష్కారం కనుక్కోవచ్చు అని చెప్పారు.
Samayam Telugu jalam jeevam campaign to save water in hyderabad ktr
నీటి సంరక్షణ కోసం ‘జలం - జీవం’: కేటీఆర్


కోటి మంది నివాసముండే నగరంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే అభివృద్ధి సాధ్యమని కేటీఆర్ అన్నారు. ‘నగరంలో నీటి కష్టాలు రావొద్దనే ఉద్దేశంతో.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీహెచ్‌ఎంసీ చట్టం చేసింది. దీనిపై నిబంధనలు కూడా వచ్చాయి. కానీ, ఎవరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం లేదు. ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కావాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

‘నీటి కొరత అనేది ఒక నగరానికో.. దేశానికో పరిమితం కాలేదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది. మహారాష్ట్రలో లాతూర్ పట్టణంలో గత వేసవిలో తీవ్ర మంచినీటి ఎద్దడి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక రైళ్లలో నీళ్లు తెప్పించే పరిస్థితిని చూశాం. మనకు అలాంటి పరిస్థితి రాకముందే మేల్కోవాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.