యాప్నగరం

Pawan Kalyan: గుంటూరులో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గుంటూరు పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం జనసేన శంఖారావం సభకు హాజరయ్యారు.

Samayam Telugu 27 Jan 2019, 7:11 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తులు ముమ్మరం చేశారు. ఏపీలో కీలకమైన గుంటూరు పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం (జనవరి 27) సాయంత్రం జనసేనాని ప్రారంభించారు. టెంకాయ కొట్టి తన పనులకు శ్రీకారం చుట్టారు. కార్యాలయం ప్రారంభం సందర్భంగా పవన్ సర్వమత ప్రార్థనలు జరిపించారు. మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.
Samayam Telugu Pawan Kalyan


మరోవైపు జనసేనాని పవన్ గుంటూరు నుంచి జనసేన పార్టీ ఎన్నికల సమర సంఖారావాన్ని పూరిస్తున్నారు. నగరంలోని లూథరన్‌ పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఇందుకు వేదికైంది. జనసేనాని పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జనసేన కీలక నేతలు, జనసేన శంఖారావం సభకు తరలివస్తున్నారు.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ మాదాసు గంగాధరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర కోఆర్డినేటర్లు మాదా రాధాకృష్ణమూర్తి, షేక్‌ సయ్యద్‌బాబు.. జనసేన భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పవన సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు వందలాది మంది జనసేన కార్యకర్తలు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.