ఎన్నికల సమీస్తున్న వేళ దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.. జిల్లా పర్యటనలతో ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ఇక పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు జనసేనాని. ఎన్నికల కోసం ప్రత్యేకంగా పార్టీ ప్రచార రథాలను సిద్ధం చేశారు. ఈ ప్రచార రథాలను సోమవారం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ముందుగా ప్రచార రథాలకు పూజలు నిర్వహించి.. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ జనసేన రథాలు పార్టీ తరపున ప్రచారంలో బిజీకానున్నాయి. వాహనాలపై జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుతో పాటూ జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నారో ఫ్లెక్సీల్లో ముద్రించారు.
జనసేన ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించిన పవన్
ప్రచార రథాలను సోమవారం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ముందుగా ప్రచార రథాలకు పూజలు నిర్వహించి.. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు.
Samayam Telugu 31 Jan 2019, 3:58 pm
ప్రధానాంశాలు:
- ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైన జనసేన
- జనసేన రథాలతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సిద్ధం
- ప్రచార రథాలపై గాజు గ్లాసు గుర్తు, ఎన్నికల హామీలు