యాప్నగరం

Pawan Kalyan: 'సైరా'తో జనసేనాని.. ఫోటో వైరల్

చాలా రోజుల తర్వాత సోదరుడు చిరంజీవిని కలిసిన పవన్ కళ్యాణ్. ఫోటోను ట్వీట్ చేసిన జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్. సైరాను కలవడం సంతోషంగా ఉందంటూ ట్వీట్.

Samayam Telugu 24 Jul 2019, 6:14 pm
మెగాస్టార్‌ చిరంజీవిని.. ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ మెగాస్టార్‌ను కలిసిన విషయాన్ని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ట్విట్టర్‌లో తెలిపారు. ముగ్గురు కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్, తాను సైరా (మెగాస్టార్ చిరంజీవిని) కలవడం ఆనందంగా ఉందన్నారు.
Samayam Telugu chiru.


మనోహర్ తన ట్వీట్‌లో ‘చిరంజీవి గారితో కలిసి ఎన్నో విషయాలపై చర్చించాం. ఆయన తన లైఫ్ జర్నీలో ఎదురైన అనుభవాలను తమతో పంచుకున్నారని.. అవి తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. ఆయన్ను కలిసేందుకు రాబోయే రోజుల్లో ఇలాంటి అవకాశాలు మళ్లీ రావాలని.. చిరంజీవి గారికి రాబోయే రోజుల్లో అంతా విజయమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’అన్నారు.
చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా తీస్తున్న `సైరా` మూవీతో బిజీగా ఉన్నారు. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతగా.. సురేంద‌ర్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్ రెండన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా నటిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.