యాప్నగరం

పబ్లిక్‌గా శిక్షించాల్సిందే.. దాచేపల్లి ఘటనపై పవన్ రియాక్షన్

గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన దారుణ సంఘటనపై జనసేన అధినేత పవర్ స్టార్ స్టార్ కళ్యాణ్ స్పందించారు.

Samayam Telugu 3 May 2018, 5:39 pm
గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన దారుణ సంఘటనపై జనసేన అధినేత పవర్ స్టార్ స్టార్ కళ్యాణ్ స్పందించారు. తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల సుబ్బయ్య అత్యాచార ఘటనపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్. ‘కతువా నుండి కన్యాకుమారి దాకా జరిగే అత్యచార సంఘటనలు విన్నప్పుడల్లా.. నాతో సహా.. పౌర సమాజం కూడా తీవ్రమైన వేదనకు గురిఅవుతుంది.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఈరోజు గుంటూరు జిల్లా దాచేపల్లి సంఘటన కూడా మనసును కలిచి వేసింది. నిస్సహాయతకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితిలో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురి అయిన ఆ బిడ్డకి, వారి కుటుంబానిిక అండగా నిలబడాలని కోరుకుంటున్నా. అసలు ఆడబిడ్డల పైన ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని నేను కోరుకుంటున్నా’ అన్నారు పవన్ కళ్యాణ్.

కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బాధితురాలి కుటుంబసభ్యులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంది. పలు చోట్ల అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్యను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.