యాప్నగరం

బాబు గారూ.. ‘నోరు చేసే అఘాయిత్యాన్ని పొట్ట భరించలేదు’: పవన్

శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జరిగిన పోరాటయాత్ర బహిరంగ సభలో చంద్రబాబుపై నిప్పులు కురిపించిన పవన్.. ట్విట్టర్‌లో మాటల దాడి పెంచుతూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

Samayam Telugu 4 Nov 2018, 3:19 pm
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా మాటల తూటాలను ఎక్కిపట్టారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జరిగిన పోరాటయాత్ర బహిరంగ సభలో చంద్రబాబుపై నిప్పులు కురిపించిన పవన్.. ట్విట్టర్‌లో మాటల దాడి పెంచుతూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.
Samayam Telugu pawan and chandra babu


‘నోరు చేసే అఘాయిత్యానికి పొట్ట భరించలేదు అన్న సామెత లాగా .. ముఖ్యమంత్రి గారు, అవకాశవాద రాజకీయాలుతో, పూటకొక మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలు విసుగు చెంది ఉన్నారు. అలిసి పోయి ఉన్నారు.. ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్వాలు ఆపేసేయాలి... ఇక భరించ లేకుండా ఉన్నాం’ అంటూ ట్వీట్ చేశారు.
అంతకు ముందు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లే ప్రధాన రహదారి కుంగిపోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘ఒక చిన్న భూకంపం వస్తే పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో ఒక కిలోమీటర్ రోడ్డు ఎలా పగిలిపోతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దృష్టికి వెళ్లిందని ఆశిస్తున్నాను. ఇది ఎందుకు సంభవించిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరుతున్నాను’ అని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.