యాప్నగరం

కొడుకుపై తల్లి దాడి చేయిస్తుందా.. టీడీపీ నేతలవి దిగజారుడు వ్యాఖ్యలు: పవన్

ఎక్కడైనా కన్న కొడుకుపై తల్లి.. సొంత అన్నపై చెల్లి దాడి చేయిస్తుందా .. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే వెకిలిగా మాట్లాడటం మంచి పద్దతి కాదు..

Samayam Telugu 2 Nov 2018, 5:41 pm
ఏపీలో శాంతిభద్రతల సమస్య ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్‌పై దాడి ఘటన మాత్రమే కాదు.. గతంలో తన పర్యటనల్లోనూ సెక్యూరిటీ సమస్యలు ఎదురయ్యాయన్నారు. శుక్రవారం సేనానితో రైలు ప్రయాణం మొదలు పెట్టిన పవన్.. జగన్‌పై దాడి, తాజా రాజకీయాలపై స్పందించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే టీడీపీ నేతలు వెకిలిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు జనసేనాని.
Samayam Telugu Jagan Pawan.


జగన్‌పై దాడి ఘటనలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు పవన్. నేతలు లక్ష్మణ రేఖ దాటి మరీ మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఎక్కడైనా కన్న కొడుకుపై తల్లి.. సొంత అన్నపై చెల్లి దాడి చేయిస్తుందా అంటూ ప్రశ్నించారు. జగన్‌పై తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దాడి చేయించారేమోనంటూ టీడీపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. టీడీపీ నేతలు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. దాడి కేసు విచారణలో రాజకీయ జోక్యం మంచిది కాదన్నారు జనసేనాని. ఈ కేసులో దర్యాప్తు లోతుగా జరగాలన్నారు. ఎవరన్నా దాడి చేయించారా.. మరేదైనా కుట్ర ఉందా అన్నది తేలాలన్నారు.

టీడీపీ - కాంగ్రెస్ పార్టీల పొత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉనికి కోసమేనని వ్యాఖ్యానించారు పవన్. ప్రజల సమస్యల పరిష్కారం వల్లే సమీకరణాలు మారతాయి తప్పా, పార్టీలు కలిస్తే సమీకరణాలు ఎప్పుడూ మారవన్నారు. చంద్రబాబు అపార అనుభవం పార్టీలతో పొత్తులు పెట్టు కోవడానికి ఉపయోగపడుతుందని సెటైర్లు వేశారు. తన అన్నయ్య కాంగ్రెస్‌లో ఉన్నా.. ఎదురించి మరి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగానే 2014లో టీడీపీకి మద్దతిచ్చానని గుర్తు చేశారు. అయినా చంద్రబాబు మళ్లీ కాంగ్రెస్‌తో కలవడం ఏంటని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.