యాప్నగరం

ఉత్తరప్రదేశ్ పర్యటనలో పవన్ కళ్యాణ్

ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. జనసేనాని వెంట పార్టీ ముఖ్య నేతలు, ఉస్మానియా ప్రొఫెసర్లు, విద్యార్థులు.

Samayam Telugu 24 Oct 2018, 11:20 am
ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం ఉదయం పవన్, పార్టీ సీనియర్ నేత నాదెళ్ల మనోహర్‌, ముఖ్య నేతలలతో కలిసి లక్నో చేరుకున్నారు. జనసేనాని వెంట ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, నిపుణులు ఈ టూర్‌లో పవన్ బీఎస్పీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు ట్విట్టర్ ద్వారా తెలిపాయి. ఈ సమావేశాల్లో తాజా రాజకీయాలతో పాటూ వచ్చే ఎన్నికల ప్రణాళికలపై చర్చించనున్నారు. బీఎస్పీతో పాటూ మరికొన్ని పార్టీల నేతల్ని కూడా పవన్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Samayam Telugu Pawan


రాష్ట్రంలో ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు పవన్. ఏపీలో కూడా మరో నాలుగైదు నెలల్లో ఎన్నికల నగారా మోగే అవకాశం ఉండటంతో.. పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే జాతీయ స్థాయి నేతల్ని కలిసి.. వారి మద్దతుతో పాటూ సలహాలు తీసుకుంటే మంచిదనే భావన ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అందుకే జనసేనాని ఉత్తరప్రదేశ్ పర్యటనలో బీఎస్పీ పార్టీ నేతల్ని కలిసి వారితో చర్చలు జరపనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.