యాప్నగరం

పవన్ జనంబాట.. నవంబర్ 2న రైలు యాత్ర

నవంబర్ 2న జనసేనాని రైలు యాత్ర.. సాధారణ ప్రజలతో కలిసి ప్రయాణించనున్న జనసేనాని.. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..

Samayam Telugu 30 Oct 2018, 10:24 pm
జనంబాట పట్టారు జనసేనాని. నవంబర్ 2న జనంతో కలిసి రైలు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం (నవంబర్ 2న) విజయవాడ నుంచి తుని వరకు ట్రైన్ జర్నీ చేయనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ పర్యటన వివరాలను జనసేన పార్టీ విడుదల చేసింది. నవంబర్ 2న మధ్యాహ్నం 1.20 గంటలకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పవన్ బయల్దేరతారు. రైలులో ప్రయాణించి సాయంత్రం 5.20 గంటలకు తుని చేరుకుంటారు. ఈ ప్రయాణంలో ప్రజలు సమస్యలను తెలుసుకుంటూనే.. జనసేన పార్టీ ఆశయాలకు పవన్ వివరించనున్నారు.
Samayam Telugu Pawan


మరోవైపు జనసేనాని అధికారికంగా ఫేస్‌బుక్‌ పేజీని మంగళవారం ప్రారంభించారు. ఆ పేజీలో తొలి పోస్టుగా తుని రైలు ప్రయాణ వివరాలను విడుదల చేశారు. తన పర్యటన వివరాలు, పార్టీ సిద్ధాంతాలను నెటిజన్లకు వివరించేందుకు ఈ పేజీని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. ఇదిలా ఉంటే పవన్ జనసేన పోరాట యాత్రను కొనసాగించనున్నారు. నవంబర్ మూడున తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. నవంబర్ 4నవంతాడ, జగ్గంపేటలలో పర్యటిస్తారు. 5, 6, 7న కాకినాడలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.