పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గురువారం పెనుగొండలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీ వాసవి ట్రస్ట్ ఆహాన్వం మేరకు పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాసవీ మాత కొలువై ఉన్న పెనుగొండకు పవిత్ర స్థలంగా విశిష్ట స్థానం ఉందన్నారు పవన్. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని.. ఆ చల్లని తల్లి ఆశీస్సులు రాష్ట్రంలోని అందరిపై ఉండాలని కోరుకున్నానన్నారు. అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహించే భాగ్యం కలిగించిన ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే పెనుగొండ పేరును.. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి పెనుగొండగా మారుస్తామన్నారు.
వాసవీ మాత కొలువై ఉన్న పెనుగొండకు పవిత్ర స్థలంగా విశిష్ట స్థానం ఉందన్నారు పవన్. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని.. ఆ చల్లని తల్లి ఆశీస్సులు రాష్ట్రంలోని అందరిపై ఉండాలని కోరుకున్నానన్నారు. అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహించే భాగ్యం కలిగించిన ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే పెనుగొండ పేరును.. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి పెనుగొండగా మారుస్తామన్నారు.