యాప్నగరం

జగన్‌కు లేఖ రాసిన జనసేనాని.. వంద రోజులు ఆగుదామనుకున్నా కానీ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇద్దామనుకున్నా కూడా భవన నిర్మాణ కార్మికుల బాధలు చూడలేకే లేఖ రాస్తున్నానన్నారు.

Samayam Telugu 30 Jul 2019, 7:37 pm
జనసేన అధనేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికుల బాధలు చూడలేకే ఈ లేఖ రాస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇసుక కొరత వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజులపాటు ప్రభుత్వానికి సమయం ఇద్దామని అనుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనేక వినతులు అందినా సంయమనం పాటించామన్నారు. ఇసుక కొరత వల్ల పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 5లోగా ఇసుక విధానం ప్రకటిస్తామని జగన్‌ చెప్పారు, మరి అప్పటి దాకా కూలీ పనులు చేసుకొనే జీవించే వారికి జీవనాధారం ఏంటని పవన్‌ ప్రశ్నించారు.
Samayam Telugu jagan pawan


కార్మికులు, కూలీల ఆకలి బాధలు రాష్ట్రానికి మంచిది కాదన్న జనసేనాని.. భవన నిర్మాణ కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకురాబోయే ఇసుక విధానం అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండాలన్నారు. నూతన ఇసుక విధానం బాగుంటే దానికి జనసేన కూడా సపోర్ట్ చేస్తుందన్నారు. బాబు హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై పదే పదే ప్రస్తావించానన్నారు. భవన నిర్మాణ కార్మికులకు తమ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు.

కొస మెరుపు ఏంటంటే.. ఇసుక లభ్యం కాకపోవడం వల్ల జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం ఆగిపోయిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.