యాప్నగరం

Pawan Kalyan: పవన్ ‘పల్లె వెలుగు’ వచ్చేస్తోంది.. బస్‌యాత్ర షెడ్యూల్ విడుదల

జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు వ్యూహాత్మకంగా సిద్ధం అవుతున్నారు.

Samayam Telugu 17 May 2018, 4:51 pm
జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు వ్యూహాత్మకంగా సిద్ధం అవుతున్నారు. తాజాగా కర్ణాటక ఎన్నికల రిజల్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూ.. ఓట్లు తక్కువ.. సీట్లు ఎక్కవతో అధికార బీజేపీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ఎలాగోలా అధికారాన్ని చేపట్టింది. ఇక ఇదే తరహా సస్పెన్స్ త్వరలో రానున్న ఏపీ ఎన్నికల్లోనూ ఉండబోతుందనేది రాజకీయ పండితుల అంచనా. ఒకవైపు అధికార టీడీపీ, మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ.. రెండు పార్టీల నడుమ జనసేన. గత ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేపట్టిన టీడీపీ రానున్న ఎన్నికల్లో సింగిల్‌గా సమరానికి సిద్ధమౌతోంది. ఇక గత ఎన్నికల్లో జస్ట్ మిస్ అనుకున్న సీఎం పీఠాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రల పేరుతో నిరంతరం జనంలోనే ఉన్నారు. తాజాగా ఈ పాదయాత్ర రెండువేల మైళ్లను చేరుకుంది.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి చంద్రబాబుకి అధికారం కట్టబెట్టిన పవన్ ఈసారి సింగిల్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీలను ఢీ కొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో ప్రతి పల్లె పల్లెకూ బస్ యాత్ర ఉండబోతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా బస్ యాత్ర వివరాలను తెలియజేస్తూ.. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈనెల 20 నుండి బస్ యాత్ర ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలపై పోరాటం దశగా తన పోరాట యాత్ర ఉంటుందని.. ఈ యాత్రకు ‘గ్రామ్ స్వరాజ్ యాత్ర’ అని నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజక వర్గాల్లో సమస్యలను గుర్తించి, అధ్యయనం చేసి వాటి పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. గతంలో ఉద్దానం విషయంలో తాను జోక్యం చేసుకున్నా ప్రభుత్వం సరైన విధంగా స్పందింలేదన్నారు. జనసేన పార్టీ 2019 ఎన్నికలే లక్ష్యంగా మన్ముందు రాజకీయ జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపడుతుందని పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.