యాప్నగరం

చంద్రబాబు ఇంటి కింద ఖనిజం: పవన్

సోమవారం నాడు విశాఖ జిల్లా అరకులో గిరిజనులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలు, అత్యవసర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.

Samayam Telugu 4 Jun 2018, 10:11 pm
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి కింద తవ్వినా ఏదో ఖనిజం ఉంటుంది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోమవారం నాడు విశాఖ జిల్లా అరకులో గిరిజనులతో సమావేశమైన ఆయన గిరిజనుల సమస్యలు, అత్యవసర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతి, అడవులు ఇంకా మనకి మిగిలి ఉన్నాయంటే దానికి కారణం గిరిజనులే అన్నారు. ప్రకృతికి దగ్గరగా బతికేవాళ్ల దగ్గర అవినీతి ఉండదు. దానిని దాటి ఏదో సంపాదించుకోవాలని అత్యాశతోనే అవినీతికి జీజం పడుతుంది. అభివృద్దికి మైనింగ్ అవసరమే. అయితే అది ఎక్కడ తవ్వాలి? ఎంత మేరకు అనేది నిబంధనలకి అనుగుణంగా ఉండాలి.
Samayam Telugu babu pawan


అమరావతిలో చంద్రబాబు ఇంటి కింద తవ్వినా ఏదో ఒక ఖనిజం దొరుకుతుంది. ఇక్కడికి గిరిజనులను రెచ్చగొట్టడానికో, మభ్యపెట్టడానికో , రాజకీయ అవసరాలకో రాలేదు. గిరిజనులకు అండగా ఉండేందుకే వచ్చా. వాళ్లను భయపెట్టి, బలహీనులుగా చేసే వారిపై పోరాడటానికి వచ్చా.
మీకు సాయం చేయడంలో అన్ని విధాలుగా అండగా ఉంటా. అందుకు మీ నుండి నేను ఏమీ ఆశించను. బాక్సైట్ మైనింగ్ విషయంలో ఎప్పుడూ గిరిజనులవైపునే పోరాడతా. బాక్సైట్ తవ్వకాలపై గ్రామసభలు పెట్టి 70 శాతం ప్రజల ఆమోదంతోనే తవ్వకాలు జరపాలి. ఏసీ గదుల్లో కూర్చొంటే వీళ్ల జీవితాలు మారవు.

మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చుతాం అని టీడీపీ మేనిపేస్టోలో పెట్టి వాళ్లో ఓట్లు వేయించుకున్నారు. దానిని నేను ప్రశ్నిస్తే గిరిజనుల్ని నాపై రెచ్చగొట్టారు. నాలుగు దశాబ్దాల చంద్రబాబు అనుభవం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టడానికే పనికి వచ్చిందంటూ’ మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.