యాప్నగరం

​పవన్ కల్యాణ్.. ఆ పార్టీలకు మరింత ఉత్సాహమిచ్చాడు!

వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ఇది వరకే ప్రకటించాడు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే.

TNN 31 Mar 2017, 9:53 am
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎన్నడూలేనంత ధీనస్థితిని ఎదుర్కొంటున్నాయి సీపీఐ, సీపీఎంలు. గతంలో చట్టసభల్లో ఈ పార్టీలకు మంచి స్థాయిలో ప్రాతినిధ్యం ఉండేది. అయితే 2009 నుంచి ఈ పార్టీలకు గడ్డుకాలం ఎదురవుతోంది. అలాగే రాష్ట్రం విడిపోయాకా వీరి ప్రాతినిధ్యం పెద్దగా లేకుండా పోయింది. తెలంగాణలో నామమాత్రంగా ఎమ్మెల్యేలు ఉండగా, ఏపీలో అస్సలు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయాడు.
Samayam Telugu janasena cpmmunist parties come closer together
​పవన్ కల్యాణ్.. ఆ పార్టీలకు మరింత ఉత్సాహమిచ్చాడు!


ఇప్పుడు కూడా ప్రజా ఉద్యమాలతో కమ్యూనిస్టు పార్టీలు ముందున్నా.. సభల్లో ప్రాతినిధ్యం లేకపోవడం మాత్రం వాటిని నిరుత్సాహపరుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై సీపీఐ, సీపీఎంలు సీరియస్ గా ఆలోచిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య కమ్యూనిస్టులకు జనసేన మీద ఆశలు మొలకెత్తాయి. గత కొన్ని నెలలుగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కమ్యూనిస్టు పార్టీల మధ్య సాన్నిహిత్యం మొదలైంది. భారతీయ జనతా పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కమ్యూనిస్టు పార్టీలకు కొత్త ఆశలు పుట్టిస్తున్నాడు.

ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టులతో కలిసి పని చేస్తానని పవన్ కల్యాణ్ ఇది వరకే ప్రకటించాడు. ఆ మధ్య సీపీఐ, సీపీఎం నేతలు పవన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో తాజాగా అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం అయిన పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారంలో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఉద్యమిస్తానని ప్రకటించాడు. దీంతో జనేసేనకు, సీపీఐ- సీపీఎం లు మరింత దగ్గరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ఇది వరకే ప్రకటించాడు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే.. కమ్యూనిస్టు పార్టీలకు, జనసేనకు మధ్య సీట్ల ఒప్పందం ఖాయంగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.