యాప్నగరం

ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: పవన్ కళ్యాణ్

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా బుధవారం (మార్చి 14) ‘జనసేన ఆవిర్భావ సభ’ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.

Samayam Telugu 13 Mar 2018, 8:00 pm
తనపై దాడి జరిగితే ప్రజాజీవితంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా బుధవారం (మార్చి 14) ‘జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకు భద్రత కల్పిస్తున్నందుకు డీజీపీకి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల అనంతపురం పర్యటనలో తొక్కిసలాట ఘటన దృష్ట్యా తాను భద్రత కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
Samayam Telugu janasena formation day meet pawan kalyan writes letter to ap dgp
ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: పవన్ కళ్యాణ్


గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపేసినందుకే అభిమానులు తీవ్ర ఆందోళన చేశారని, అది శాంతిభద్రతల సమస్యగా మారిందని పవన్‌ గుర్తుచేశారు. భద్రత విషయంలో పోలీసులు నిస్సహాయత వహిస్తే, ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. మార్చి 14 తర్వాత కూడా తనకు వ్యక్తిగత భద్రతను కొనసాగించాల్సిందిగా డీజీపీని పవన్ కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.