యాప్నగరం

Pawan Kalyanకు సైతం షాక్ తప్పదా..? బీజేపీలోకి జనసేన నేత?

ఏపీలో బీజేపీ ఆపరేషన్ కమలాన్ని మొదలు పెట్టింది. టీడీపీకి చెందిన నేతలకు ఆ పార్టీ గాలం వేస్తోంది. జనసేన నేతలు కూడా కమలం గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది.

Samayam Telugu 20 Jun 2019, 10:07 pm
ఎన్నికలు ముగిశాక.. ఏపీలో ఆపరేషన్ కమలం మొదలైంది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బుధవారం బీజేపీ గూటికి చేరారు. చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. టీడీపీతోపాటు జనసేనకు చెందిన నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుల పట్ల వైఎస్ఆర్సీపీ ఆచితూచి వ్యవహరిస్తుండటంతోపాటు జగన్‌తో పొసగదని భావిస్తున్న నేతలు కూడా బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు.
Samayam Telugu akula satyanarayana


జనసేన నేత ఆకుల సత్యనారాయణ తిరిగి బీజేపీలో చేరే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఏపీ ఎన్నికల ముందు జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో భవిష్యత్తు కోసం ఆయన జనసేనను వీడి మళ్లీ బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే రావెల కిశోర్ బాబు జనసేనకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.