సమర్థత లేని నాయకుల వల్లే ఓడిపోయాం: పవన్ కళ్యాణ్
జనసేన ఓటమికి సమర్థత లేని నాయకత్వమే కారణమని పవన కళ్యాణ్ తెలిపారు. మనం అధికారంలోకి రాలేకపోవచ్చు గానీ.. మనతో గొడవపడిన వారు కూడా అధికారంలోకి రారన్నారు.
Samayam Telugu 31 Jul 2019, 9:07 pm
మాయ మాటలు, మోసపూరిత వాగ్ధానాలతో అందలం ఎక్కాలని కలలో కూడా అనుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజమండ్రి జనసేన నేతలు, కార్యకర్తలతో బుధవారం భేటీ అయిన పవన్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలా మాట మార్చమన్నారు. ఎన్నికలకు ముందు వృద్ధులకు రూ.3 వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా గెలిదాక రూ. 2,250 చేతులో పెట్టి అంచెలంచెలుగా పెంచుతామని మాట మార్చనని అన్నారు. బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికి వచ్చాను తప్ప, అబద్ధాలతో అందలం ఎక్కడానికి కాదన్నారు. ఓటమి తర్వాత కూడా జనసేన పార్టీని యువత, ఆడపడుచులు గుండెల్లో పెట్టుకుంటున్నారంటే దానికి కారణం ఓటమిలో కుంగిపోలేదు, గెలుపులో కాలర్ ఎగరేయకుండా స్థిరంగా ఉండబట్టేనని అన్నారు.
రాజమండ్రి కవాతుకు ఉప్పెన, ప్రభంజనంలా 10 లక్షల మంది యువత కదిలివస్తే మీడియాలో కనీస ప్రచారం కల్పించలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో కాదు కదా మన గల్లీల్లో కూడా చూపించలేదన్నారు. అదే విదేశాల్లో 10 లక్షల మంది రోడెక్కితే ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ అయ్యేదన్నారు. డబ్బు, మద్యం పంచకుండా అంతమంది యువత కదిలి వచ్చారంటే నాలో ఉన్న భావనే వారిలో కూడా ఉంది. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం అన్నారు. దానికి కారణం కార్యకర్తలను అనుసంధానం చేయగలిగే పటిష్టమైన నాయకత్వం పార్టీలో లేకపోవడమే అన్నారు.
క్యాన్సర్తో చనిపోతూ కూడా పార్టీ విజయం కోసం పనిచేసే నిస్వార్థ కార్యకర్తలు ఉన్నారు కానీ, వారిని సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లి నాయకులు లేరన్న పవన్.. ఇవన్ని అర్థం చేసుకున్నానని తెలిపారు. కొత్త తరం నాయకత్వాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అందుకే రాజకీయాల్లో 25 ఏళ్లు ప్రయాణం చేయడానికి వచ్చానని చెప్పానని పవన్ తెలిపారు.
‘‘నాయకుడు అంటే 360 డిగ్రీల్లో ఆలోచించాలన్న జనసేనాని.. ఆశయాన్ని ముందుకు తీసుకొళ్లడానికి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. ఎన్నికలకు 5 నెలల ముందు పార్టీలోకి వచ్చి నన్ను ప్రభావితం చేయాలని చూశారు, వీళ్ల మాట నేనెందుకు వింటాను. అంత బలహీనంగా కనిపిస్తున్నానా..?
మీకు నిజంగా దమ్ముంటే ఒక సమస్యపై రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయగలరా..? అని పవన్ ప్రశ్నించారు. అంబేద్కర్ భవన్ లాంటి సౌకర్యాలు లేని చోట రోజుల తరబడి ఉండగలరా...? తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయమంటే గ్రూపులు కట్టారు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించ లేకపోయారు. అప్పుడే నాకు ఓటమి కనిపించింది. ఇంత ప్రజాబలం ఉండి కేవలం నాయకత్వం లోపంతో ఓడిపోయాం’’ అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలా పార్టీ నిర్మాణం జరగాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ పార్టీలా నిర్మాణం వెనుక దశాబ్దాల కృషి ఉంది. ఖద్ధర్ చొక్కా, చేతిలో చిన్న సంచితో మూడు తరాలు పనిచేస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని ప్రజాదరణ ఉన్న నాయకుడు స్థాపించిన అనుభవజ్ఞులు ఆయన పక్కన నిలబడ్డారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పట్టుమని 150 మంది ఉన్నారు. ఇవాళ కేవలం ఆశయ బలంతో అంచెలంచెలుగా ఎదిగి పార్టీ ఈ స్థాయికి చేరింది.
జనసేన పార్టీకి ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి ఉందో లేదో తెలియదు గానీ, మనతో గొడవ పెట్టుకున్నవారిని ప్రభుత్వంలోనికి రాకుండా చేయగలిగే శక్తి అయితే ఉంది. జనసేన పార్టీని విలీనం చేయమని దాలా ఒత్తిళ్లు వచ్చాయి. విలీనం చేసే ఆలోచనే ఉంటి పార్టీనే పెట్టను. మా ఆత్మగౌరవం, ఉనికి కోల్పోం. ఒక్క ఓటు వచ్చినా సరే అది మా ఉనికి. అలాంటి ఉనికిని వేరే పార్టీలో విలీనం చేసి చంపుకోం’’ అని పవన్ తెలిపారు.
రాజమండ్రి కవాతుకు ఉప్పెన, ప్రభంజనంలా 10 లక్షల మంది యువత కదిలివస్తే మీడియాలో కనీస ప్రచారం కల్పించలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో కాదు కదా మన గల్లీల్లో కూడా చూపించలేదన్నారు. అదే విదేశాల్లో 10 లక్షల మంది రోడెక్కితే ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ అయ్యేదన్నారు. డబ్బు, మద్యం పంచకుండా అంతమంది యువత కదిలి వచ్చారంటే నాలో ఉన్న భావనే వారిలో కూడా ఉంది. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం అన్నారు. దానికి కారణం కార్యకర్తలను అనుసంధానం చేయగలిగే పటిష్టమైన నాయకత్వం పార్టీలో లేకపోవడమే అన్నారు.
క్యాన్సర్తో చనిపోతూ కూడా పార్టీ విజయం కోసం పనిచేసే నిస్వార్థ కార్యకర్తలు ఉన్నారు కానీ, వారిని సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లి నాయకులు లేరన్న పవన్.. ఇవన్ని అర్థం చేసుకున్నానని తెలిపారు. కొత్త తరం నాయకత్వాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అందుకే రాజకీయాల్లో 25 ఏళ్లు ప్రయాణం చేయడానికి వచ్చానని చెప్పానని పవన్ తెలిపారు.
‘‘నాయకుడు అంటే 360 డిగ్రీల్లో ఆలోచించాలన్న జనసేనాని.. ఆశయాన్ని ముందుకు తీసుకొళ్లడానికి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. ఎన్నికలకు 5 నెలల ముందు పార్టీలోకి వచ్చి నన్ను ప్రభావితం చేయాలని చూశారు, వీళ్ల మాట నేనెందుకు వింటాను. అంత బలహీనంగా కనిపిస్తున్నానా..?
మీకు నిజంగా దమ్ముంటే ఒక సమస్యపై రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయగలరా..? అని పవన్ ప్రశ్నించారు. అంబేద్కర్ భవన్ లాంటి సౌకర్యాలు లేని చోట రోజుల తరబడి ఉండగలరా...? తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయమంటే గ్రూపులు కట్టారు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించ లేకపోయారు. అప్పుడే నాకు ఓటమి కనిపించింది. ఇంత ప్రజాబలం ఉండి కేవలం నాయకత్వం లోపంతో ఓడిపోయాం’’ అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలా పార్టీ నిర్మాణం జరగాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ పార్టీలా నిర్మాణం వెనుక దశాబ్దాల కృషి ఉంది. ఖద్ధర్ చొక్కా, చేతిలో చిన్న సంచితో మూడు తరాలు పనిచేస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని ప్రజాదరణ ఉన్న నాయకుడు స్థాపించిన అనుభవజ్ఞులు ఆయన పక్కన నిలబడ్డారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పట్టుమని 150 మంది ఉన్నారు. ఇవాళ కేవలం ఆశయ బలంతో అంచెలంచెలుగా ఎదిగి పార్టీ ఈ స్థాయికి చేరింది.
జనసేన పార్టీకి ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి ఉందో లేదో తెలియదు గానీ, మనతో గొడవ పెట్టుకున్నవారిని ప్రభుత్వంలోనికి రాకుండా చేయగలిగే శక్తి అయితే ఉంది. జనసేన పార్టీని విలీనం చేయమని దాలా ఒత్తిళ్లు వచ్చాయి. విలీనం చేసే ఆలోచనే ఉంటి పార్టీనే పెట్టను. మా ఆత్మగౌరవం, ఉనికి కోల్పోం. ఒక్క ఓటు వచ్చినా సరే అది మా ఉనికి. అలాంటి ఉనికిని వేరే పార్టీలో విలీనం చేసి చంపుకోం’’ అని పవన్ తెలిపారు.