యాప్నగరం

బాబూ.. అఖిలపక్షంలో సంకల్పం లోపించింది: జనసేన

తెలుగు దేశం పార్టీ రాజకీయ ఎత్తుగడల కోసమే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తోంది. బాబు తలపెట్టిన అఖిలపక్ష భేటీలో సంకల్పం లోపించింది. - జనసేన

Samayam Telugu 27 Mar 2018, 9:59 am
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న అఖిలపక్ష భేటిలో పాల్గొనబోమని జనసేన, వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో మేం పాఠాలు చెప్పించుకోవాలా అని వైసీపీ మండిపడగా.. అఖిలపక్ష సమావేశాన్ని రాజకీయ ఎత్తుగడగా జనసేన అభివర్ణించింది. ఈ భేటికి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో.. ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఏ పనికైనా సంకల్పం బలంగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. కానీ బాబు తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సంకల్పం లోపించిందని జనసేన మండిపడింది.
Samayam Telugu pawan


ముందుగా ఈ భేటీని అఖిల సంఘాలకు మాత్రమే అని చెప్పి చివర్లో రాజకీయ పార్టీలను కూడా కలిపేయడం ఏంటని నిలదీసింది. ఈ సమావేశం నిర్వహణను టీడీపీ రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించింది. ఐదు కోట్ల మంది ఆంధ్రులను మభ్య పెట్టడానికే ఈ భేటీ అని ఘాటుగా విమర్శించింది. ప్రజల్ని వంచించే ఏ చర్యనైనా జనసేన తీవ్రంగా ఖండిస్తుంది, అందుకే అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉంటున్నామని తెలిపింది.

విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు తదితర అంశాల గురించి చర్చించడం కోసం మంగళవారం ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలోని సీఎం ఆఫీసులో ఈ సమావేశం జరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.