జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 11న (శనివారం) కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లనున్నారు. ఇటీవలే కన్నూమూసిన జనసేన నేత, ఎంపీ ఎస్పీవై రెడ్డికి నివాళులు అర్పిస్తారు.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. జనసేన పార్టీ తన ప్రకటనలో ‘సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి శ్రీ ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట తుదిశ్వాస విడిచారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం నంద్యాల వెళతారు. ఆ రోజు ఎస్పీవై రెడ్డికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు’ అని తెలిపారు.
ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30న కన్నుమూశారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధుల కారణంగా.. హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఏప్రిల్ 3న ఆయన హాస్పిటల్లో చేరగా.. అప్పటి నుంచి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నంద్యాల సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డికి టీడీపీ టిక్కెట్ నిరాకరించడంతో.. ఇండిపెండెంట్గా పోటీ చేటీ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ జనసేన నుంచి ఆహ్వానం అందడంతో ఆయన పవన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన జనసేన తరఫున ఎంపీగా పోటీ చేశారు.
నంద్యాల పర్యటనకు పవన్.. కారణమిదే
ఈ నెల 11 (శనివారం)న కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనకు వెళుతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. జనసేనాని పర్యటన వివరాలు వెల్లడించిన పార్టీ కార్యాలయం.
Samayam Telugu 9 May 2019, 8:51 pm
ప్రధానాంశాలు:
- శనివారం నంద్యాల పర్యటనకు పవన్ కళ్యాణ్
- ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పవన్ కళ్యాన్ పరామర్శ
- ఇటీవలే కన్నుమూసిన ఎంపీ ఎస్పీవై రెడ్డి