యాప్నగరం

హరికృష్ణగారి అకాల మరణం దురదృష్టకరం: పవన్ కళ్యాణ్

నందమూరి హరికృష్ణ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన సంతాపాన్ని తెలియజేశారు. జనసేన తరపున ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. అందులో ‘నల్గొండ జిల్లాలో హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాద వార్త వినాల్సి వచ్చిందన్నారు.

Samayam Telugu 29 Aug 2018, 6:31 pm
నందమూరి హరికృష్ణ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన సంతాపాన్ని తెలియజేశారు. జనసేన తరపున ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. అందులో ‘నల్గొండ జిల్లాలో హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాద వార్త వినాల్సి వచ్చిందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని.. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకెళ్లేందుకు భగవంతుడు శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు.
Samayam Telugu Pawan.


తన తరపున, జనసేన పార్టీ తరపున హరికృష్ణ గారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. ఆయన అకాల మరణానికి సంతాపంగా బుధవారం జరగాల్సిన జనసేన పార్టీ కార్యక్రమాలు రద్దు చేసినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.