యాప్నగరం

కరీంనగర్‌లో జనసేన బహిరంగ సభ..

మే మొదటి వారంలో కరీంనగర్‌ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తరలివచ్చే ఈ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతాయని సమాచారం.

Samayam Telugu 25 Apr 2018, 12:09 pm
ఇప్పటివరకూ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే దృష్టి సారించిన పవన్.. ఇప్పుడు తెలంగాణపైనా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మే మొదటి వారంలో కరీంనగర్‌ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తరలివచ్చే ఈ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏపీలోని చిత్తూరులోనూ సభ నిర్వహించే యోచనలో జనసేన ఉంది.
Samayam Telugu pawan


పవన్‌ ఇటీవల తెలంగాణ ప్రాంతం నుంచే తన రాజకీయ పర్యటన ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొండగట్టు ఆలయంలో ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడ నుంచే ఆయన తన రాజకీయ యాత్ర ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల ద్వారా యాత్ర కొనసాగించారు. క్షేత్రస్థాయిలో అభిమానులు, ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. వివిధ చోట్ల అభిమాన సంఘాలు, పార్టీ నేతలతో సమావేశమై పార్టీ నిర్మాణం గురించి చర్చించారు.

2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన పవన్‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.