యాప్నగరం

Jana Sena: జనసేన పార్టీ గుర్తు ‘పిడికిలి’.. అదే ఎందుకంటే: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ గుర్తుపై ఊహాగానాలకు పవన్ కళ్యాన్ తెరదించారు. ‘పిడికిలి’ జనసేన పార్టీ గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం (ఆగస్టు 13) జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. పార్టీ గుర్తును ప్రకటించారు.

Samayam Telugu 13 Aug 2018, 10:46 pm
జనసేన పార్టీ గుర్తుపై ఊహాగానాలకు పవన్ కళ్యాన్ తెరదించారు. ‘పిడికిలి’ జనసేన పార్టీ గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం (ఆగస్టు 13) జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. పార్టీ గుర్తును ప్రకటించారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని ఆయన చెప్పారు. అన్ని కులాలు, అన్ని మతాలు కలిసికట్టుగా ఉండి బలాన్ని చాటేలా పిడికిలి చూపుతామన్నారు.
Samayam Telugu fist


ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో తనను తాను ఎన్టీఆర్‌గా పోల్చుకుంటూ వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ బృందాలు, రౌడీలకు తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు.

‘వారికి (టీడీపీ) ఉన్నవి రెండే అవకాశాలు.. ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయడం. నేను దానికి సిద్ధం. లేదు.. వీధుల్లోకి వస్తామంటే అందుక్కూడా సిద్ధం. అవసరమైతే కర్ర పట్టుకొని కూడా పోరాడతాం’ అని పవన్ స్పష్టం చేశారు. ఎర్రకాలువ సమస్యపై తాను ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతున్నానని ఆయన చెప్పారు.

కేజీ బేసిన్ ప్రజలందరిదని, దానిలో వాటా ఏపీ ప్రజలందరి హక్కు అని పవన్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి టీడీపీకి చెందిన ఒక వ్యవస్థ ద్వారా టన్నులకొద్ది రేషన్‌ బియ్యం ఆఫ్రికాకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అనుభవజ్ఞులైనవారు కావాలనే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని చెప్పారు. నిడదవోలులో ఆర్వోబీ బ్రిడ్జి నిర్మించలేకపోవడానికి ఇక్కడి పాలకులే కారణమని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.