యాప్నగరం

ప్రగతిభవన్: కేసీఆర్‌తో పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. సోమవారం (జనవరి 1) సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

TNN 1 Jan 2018, 8:26 pm
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. సోమవారం (జనవరి 1) సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. సీఎం కేసీఆర్‌ను పవన్ మర్యాదపూర్వకంగానే కలిసినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌కు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పవన్.. ప్రగతిభవన్‌కు విచ్చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ కలవడానికి రాజ్‌భవన్ వెళ్లారు. దీంతో పవన్ అక్కడే చాలాసేపు వేచి చూశారు. అనంతరం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయణ్ని కలిసి సుదీర్ఘంగా చర్చించారు.
Samayam Telugu janasena president pawan kalyan meets telangana cm kcr
ప్రగతిభవన్: కేసీఆర్‌తో పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీ


ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులోనూ కేసీఆర్‌తో పవన్ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేన పార్టీని విస్తరించాలనుకుంటున్న పవన్.. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలవడం వెనక ఆంతర్యమేమిటనేది సగటు పౌరుడి సందేహం. అయితే.. ఈ సమాధానం కోసం వేచి చూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.