యాప్నగరం

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితతో ఎస్సై..

ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వివాహితను లోబర్చుకున్న ఓ ఎస్సై ఆమె భర్తను బెదిరించాడు.

TNN 31 Jan 2018, 11:24 am
పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్సై ఆమెను లోబర్చుకున్నాడు. మాటలతో ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసింది. భర్తపై కేసు పెట్టడానికి వచ్చిన మహిళతో నర్సింహులు అనే ఎస్సై మాట కలిపాడు. ఆమెతో పరిచయం పెంచుకొని చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. ఆమెను తన వైపు తిప్పుకున్న ఎస్సై.. తనతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టాడు.
Samayam Telugu jawahar nagar si narsimhulu trapped a married woman
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితతో ఎస్సై..


ఇద్దరి మధ్య చనువు పెరిగిపోవడంతో... ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త మందలించాడు. దీంతో విడాకులు ఇవ్వాలని ఆమె భర్త సతీష్‌ను ఎస్సై నర్సింహులు బెదిరించాడు. దీంతో సతీష్ మాల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వరరావును ఆశ్రయించాడు. ఎస్సై బెదిరిస్తున్నాడని, ఆయన బారి నుంచి కాపాడాలని కోరాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను లోబర్చుకొని, విడాకులివ్వాలని ఆమె భర్తను బెదిరించిన ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు. అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.