యాప్నగరం

తగ్గేదే లేదు.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి జేసీ!

విమానయాన సంస్థల నిషేధానికి గురైన అనంతంపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తగ్గేదే లేదంటున్నారు.

TNN 18 Jul 2017, 9:27 am
విమానయాన సంస్థల నిషేధానికి గురైన అనంతంపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తగ్గేదే లేదంటున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన జేసీపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో క్షమాపణలు చెప్పడానికి ఇష్టపడని జేసీ.. సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. సుమారు రూ.7 లక్షలు వెచ్చించి చార్టర్డ్‌ ఫ్లైట్‌ను సొంతంగా బుక్‌ చేసుకున్న జేసీ.. విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడ రాష్ట్రపతి పోలింగ్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్నారు.
Samayam Telugu jc diwakar reddy flies to delhi in a special flight
తగ్గేదే లేదు.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి జేసీ!


సోమవారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్న జేసీ.. అనంతరం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో కాసేపు మాట్లాడారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జేసీకి అరుణ్ జైట్లీ సూచించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి సుజనాచౌదరిని పిలిచి ఇదే అంశాన్ని చర్చించారు. అయితే, జేసీ నుంచి విమానయాన శాఖ క్షమాపణ లేఖ కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి జేసీ సిద్ధంగా లేకపోవడంతోనే నిషేధం కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు నిషేధంపై స్టే ఇవ్వాలని జేసీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్డు నిరాకరించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.