యాప్నగరం

మోదీ-షా ఉచ్చులో చంద్ర‌బాబు: దివాక‌ర్ రెడ్డి

తాజాగా జేసీ మరో సారి ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పన్నిన ఉచ్చులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిక్కుకున్నారని, దాన్నుంచీ చంద్రబాబు బయట పడలేక పోతున్నారని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

TNN & Agencies 2 Mar 2018, 5:42 pm
త‌న మాట‌ల‌ను ముక్కు సూటిగా చెప్పే రాజ‌కీయ నాయ‌కుల‌లో అనతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. ఈ రోజు టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu jc diwakar reddy interesting comments on chandra babu situation
మోదీ-షా ఉచ్చులో చంద్ర‌బాబు: దివాక‌ర్ రెడ్డి


తాజాగా ఆయన మరో సారి ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పన్నిన ఉచ్చులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిక్కుకున్నారని, దాన్నుంచీ చంద్రబాబు బయట పడలేక పోతున్నారని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన చంద్రబాబు హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే పెద్దమనిషి తరహాలో ఒప్పుకున్నారని, కాని అది కూడా ఇవ్వకుండా ఆడుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా కేంద్రం దిగి వచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు, అలాగే అమిత్ షాతో ఎంపీలు చర్చలు జరిపినా ఏమీ సాధించలేదని అన్నారు.


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నదే తమ ప్రధాన డిమాండని తేల్చి చెప్పారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తలచుకుంటే ఏపనైనా జరుగుతుందని జేసీ అభిప్రాయ పడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుకు పోరాటం చేస్తామని, ముఖ్యంగా కేంద్రం నుంచి బయటకు రావాలని ప్రజల నుంచే డిమాండ్ వస్తోందని, తాము ఎన్డీయే నుంచి వైదొలగినా, ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని ప్రజలు గమనించాలని కోరారు. కాని పార్టీ తో సంబంధం లేకుండా జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయిస్తే, వ్యక్తిగతంగా తాను కూడా రాజీనామా చేస్తానని జేసీ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.