యాప్నగరం

ప్రబోధానంద ఎవరో తెలియదా జేసీ.. ఈ ఫొటోలు ఏంటి!

ప్రబోధానంద స్వామీజీకి తాను సాష్టాంగపడ్డానని వచ్చిన ఆరోపణలపై స్పందించిన జేసీ.. ఆయనెవరో కూడా తనకు తెలియదన్నారు.

Samayam Telugu 19 Sep 2018, 4:20 pm
వినాయక నిమజ్జనం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమలలో ఇటీవల చెలరేగిన వివాదం ఉద్రికత్తలకు దారితీసింది. చిన్నపొడమల వద్ద ఆధ్యాత్మికవేత్త ప్రబోధానంద అనుచరులు, గ్రామస్తులకు మధ్య చేలరేగిన వివాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్తులకు మద్దతుగా దీక్షకు దిగారు. దీంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లనుందని పోలీసు బలగాలను అక్కడ మోహరించారు.
Samayam Telugu jc diwakar reddy And Prabhodananda Swami


ఈ క్రమంలో ప్రబోధానంద స్వామిపై, ఆయన ఆశ్రమంపై ఎంపీ జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వామీజీకి తాను సాష్టాంగపడ్డానని వచ్చిన ఆరోపణలపై స్పందించిన జేసీ.. ఆయనెవరో కూడా తనకు తెలియదన్నారు. అయితే ప్రబోధానంద ఆశ్రమ బాధితులు చాలామంది ఉన్నారని, త్వరలోనే కొన్ని వీడియోలను విడుదల చేస్తానని దివాకర్‌రెడ్డి ఇటీవల మీడియాకు వెల్లడించారు. కాగా, ప్రబోధానంద ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. స్వయంగా జేసీనే 12 ఏళ్ల కిందట ప్రభోదానంద స్వామి ఆశ్రమాన్ని ప్రారంభించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం ప్రారంభంలో, మరికొన్ని సందర్భాల్లో స్వామిజీతో జేసీ దివాకర్ రెడ్డి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫొటోలు చూసి తనకు ప్రబోధానందా తెలుసునో లేదో చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలోనూ నిమజ్జనం సమయంలో చిన్నపాటి గొడవలు జరిగేవని, కానీ ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకోవడంతో వివాదం ముదురుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రబోధానంద కుమారుడు యోగానంద చౌదరి ఇటీవల బీజేపీలో చేరడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయన్న విమర్శలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.