యాప్నగరం

​జేసీపై మరింత నిషేధం: అయినా విమానమెక్కి విదేశానికి!

అరడజనుకు పైగా విమానయాన సంస్థలు జేసీని నిషేధిత ప్రయాణికుడిగా పేర్కొన్నా కూడా ఆయన ఎంచక్కా విమానం ఎక్కి

TNN 18 Jun 2017, 1:05 pm
వైజాగ్ ఎయిర్ పోర్టులో రభస చేసిన తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఇండిగో, ఎయిరిండియా, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలు మొదటి రోజునే నిషేధం విధించాయి. ఆయనను నిషేధిత ప్రయాణికుల జాబితాలో చేర్చాయి ఆ సంస్థలు. వాటిని చూసి ఎయిర్ ఏసియా, విస్తార, గో ఎయిర్ వంటి ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా జేసీని నిషేధిత ప్రయాణికుడిగా పేర్కొన్నాయి. తమ విమానాల్లో ఆయనను ఎక్కనివ్వమని స్పష్టం చేశాయి.
Samayam Telugu jc diwakrar reddy went paris
​జేసీపై మరింత నిషేధం: అయినా విమానమెక్కి విదేశానికి!


ఇలా అరడజనుకు పైగా విమానయాన సంస్థలు జేసీని నిషేధిత ప్రయాణికుడిగా పేర్కొన్నా కూడా ఆయన ఎంచక్కా విమానం ఎక్కి విదేశం వెళ్లారు. తన కుటుంబంతో కలిసి ఆయన పారిస్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. విహారానికి ఈ విదేశీ పర్యటనకు వెళ్లారట జేసీ. మరి పారిస్ వెళ్లాలి అంటే తప్పనిసరిగా విమానమే ఎక్కాలి కదా.. మరి ఈ నిషేధాలు జేసీని ఆపలేకపోయాయా? అంటే, ఔననే చెప్పాలి. పలు దేశీయ విమానయాన సంస్థలు జేసీని నిషేధ ప్రయాణికుడిగా పేర్కొన్నా ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ విమానంలో జేసీ పారిస్ వెళ్లారు.

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానంలో జేసీ పారిస్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. జేసీపై వివిధ విమానయాన సంస్థలు ప్రయాణ నిషేధం విధించినా.. ఎమిరేట్స్ మాత్రం ఆ పని చేయలేదు. బహుశా ఈ సంఘటన సమాచారం కూడా ఎమిరేట్స్ కు తెలిసి ఉండకపోవచ్చు.. అందుకే జేసీ ఎంచక్కా విమానం ఎక్కడానికి అవకాశం లభించి ఉండవచ్చని తెలుస్తోంది.

జేసీ విదేశీ పర్యటనకు, వైజాగ్ ఎయిర్ పోర్టు సంఘటనకూ ఏం సంబంధం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లాలని జేసీ ముందే అనుకున్నారని, ఆ మేరకే పారిస్ వెళ్లారని వారు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.