తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల టీఎస్ఆర్టీసీకి తీవ్ర నష్టం వస్తోందని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ ట్రావెల్స్కు అడ్డుకట్ట వేయాలని శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. దీన్ని సవాల్గా స్వీకరించిన తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి.. అన్ని అనుమతులతోనే బస్సులను నడుపుతున్నామని, దమ్ముంటే తనతో చర్చకు రావాలని శ్రీనివాస్ గౌడ్కు ప్రతి సవాల్ విసిరారు.
ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ మంగళవారం తన అనుచరులతో ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. శ్రీనివాస్ గౌడ్తో బహిరంగంగా చర్చించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు జేసీని అడ్డుకున్నారు. ఆయన్ని బలవంతంగా పోలీసు స్టేషన్కు తరలించారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే తనతో చర్చకు రావాలని ప్రభాకర్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. అన్ని ఆధారాలతో ఇక్కడికి వచ్చానని, తనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని మండిపడ్దారు.
అయితే తెలంగాణలో నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో ఎన్నింటికి సరైన అనుమతులు ఉన్నాయో ఆధారాలు చూపాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. పాలెం ఘటనలో నష్టపోయిన ఎంతమందికి మీరు సాయం చేసారని శ్రీనివాస్ ప్రశ్నించారు.
ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ మంగళవారం తన అనుచరులతో ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. శ్రీనివాస్ గౌడ్తో బహిరంగంగా చర్చించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు జేసీని అడ్డుకున్నారు. ఆయన్ని బలవంతంగా పోలీసు స్టేషన్కు తరలించారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే తనతో చర్చకు రావాలని ప్రభాకర్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. అన్ని ఆధారాలతో ఇక్కడికి వచ్చానని, తనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని మండిపడ్దారు.
అయితే తెలంగాణలో నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో ఎన్నింటికి సరైన అనుమతులు ఉన్నాయో ఆధారాలు చూపాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. పాలెం ఘటనలో నష్టపోయిన ఎంతమందికి మీరు సాయం చేసారని శ్రీనివాస్ ప్రశ్నించారు.