యాప్నగరం

అనంతలో ప్రమాదం: జెఎన్టీయూ వీసీ మృతి

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

TNN 22 Feb 2017, 6:21 pm
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పామిడి మండలం గజరాం పల్లి సమీపంలో ఇన్నోవా కారును... లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్స్‌లర్ సర్కార్ మరణించారు. అతనితో పాటూ పర్సనల్ సెక్రటరీ ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాద్ కూడా అక్కడికక్కడే మరణించారు. వీరు కారులో కర్నూలు వెళుతుండగా ఘటన జరిగింది. అనంతపురం ఎస్పీ రాజశేఖర్ బాబు సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Samayam Telugu jntu vc sarkar dies in accident in ananthapur
అనంతలో ప్రమాదం: జెఎన్టీయూ వీసీ మృతి


వీసీ మృతితో జేఎన్టీయూలో తీవ్ర విషాదం నెలకొంది. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.