యాప్నగరం

తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం..

గత రెండేళ్లుగా పార్టీ పుంజుకుంటున్న తీరును గమనిస్తే.. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా ఏర్పడింది..

TNN 22 May 2017, 5:10 pm
రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన నల్గొండ జిల్లా చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘భారతీయ జనతా పార్టీ విశ్వంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ పార్టీకి 11 కోట్ల మందికి పైగా సభ్యులున్నారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. గత రెండేళ్లుగా పార్టీ పుంజుకుంటున్న తీరును గమనిస్తే.. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా ఏర్పడింది’ అని పేర్కొన్నారు.
Samayam Telugu join hands with modi to make telangana no 1 state says amit shah
తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం..


కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశ పెడుతోందని, అవి సామాన్యుల వరకూ చేరడం లేదని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మంజూరు చేసిన పథకాలు తెరటుపల్లిలో అమలు కావడం లేదని తన దృష్టికి వచ్చినట్లు షా తెలిపారు. అభివృద్ధి పథకాల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మోదీతో చేతులు కలపాలని ఆయన కోరారు.

పార్టీని మరింత పటిష్ట పరచడానికే రాష్ట్రాల పర్యటన ప్రారంభించినట్లు షా చెప్పారు. ఆయన ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. మావోయిస్టుల చేతిలో హతమైన మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత బూత్‌ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పటిష్టానికి కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.