యాప్నగరం

కాంగ్రెస్‌లోకి నాగం, గద్దర్ కుమారుడు?

తెలంగాణలో కాంగ్రెస్‌లోకి మళ్లీ వలసలు మొదలైనట్లు కనిపిస్తోంది. కొంతమంది ముఖ్య నేతలు పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందట.

Samayam Telugu 24 Apr 2018, 8:39 pm
Samayam Telugu Gaddar Son
తెలంగాణలో కాంగ్రెస్‌లోకి మళ్లీ వలసలు మొదలైనట్లు కనిపిస్తోంది. కొంతమంది ముఖ్య నేతలు పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందట. వీరిలో మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు సూర్య, ఆది శ్రీనివాస్‌తో పాటూ మరికొంతమంది ఉన్నారు. వీరంతా బుధవారం (25-04-2018) ఏఐసీసీ ఆఫీస్‌లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చేరికలపై పార్టీ వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగినా... ఆయన మాత్రం స్పందించలేదు. ఇక ఆది శ్రీనివాస్ 2014లో బీజేపీ తరపున వేములవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గద్దర్ కుమారుడు సూర్య రాజకీయాలకు కొత్త.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.